ది ఈగల్ న్యూస్ : మోత్కూర్
- మోత్కూర్ లో దాబా హోటల్ ఓపెనింగ్ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు… పైళ్ల
- యాదాద్రి భువనగిరి జిల్లా ,మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసిన SR దాబా ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి గారు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ఉద్యోగాలకోసం యువకులు పట్టణాలకు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కునే బదులు స్వగ్రామం లోనే ఉండి స్వయం ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంపొందుతుందని తెలిపారు.ఇలాంటి వ్యాపారాలు పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన , రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించాలని కోరారు. యువ పారిశ్రామిక వెతలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని అన్నారు.
SR దాబా ప్రొప్రైటర్స్ నాయిని రాజేష్, సోమ సాయికుమార్ అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినియోగదారులకు శుభ్రత మరియు రుచిలో నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఉత్తమమైన సేవలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోత్కూర్ టౌన్ కాంగ్రేస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్, PACS డైరెక్టర్ ఆకుల వెంకటేశ్వర్లు, AMC డైరెక్టర్ MD. సమీర్, మండల కాంగ్రేస్ నాయకులు జినుకల కనకయ్య పలువురు ప్రముఖులు హాజరయ్యారు.